కలికిరిలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు

కలికిరి, 2026 జూలై 18: కలికిరి గ్రామ దేవత శ్రీ యల్లమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర నేడు (జూలై 18) సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ రథయాత్రను స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రథయాత్ర విజయవంతం కావడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ వీధుల గుండా అమ్మవారి రథోత్సవం సాగనున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించనున్నారు....