ఆటో–కారు ఢీ ఇద్దరికి గాయాలు
రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తిరుపతి నుంచి రేణిగుంట వైపు వస్తున్న కారు, ట్రాన్స్ఫార్మర్ వీధి నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చిన ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.