🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 19 Jul, 2026 | Page: 1

ఆదివారం ప్రత్యేక తరగతులు నిలిపివేత

పీలేరు, జూలై 19 (రాజనీతి): ప్రభుత్వ సెలవు దినమైన ఆదివారం పీలేరులోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎన్‌ఎస్‌యూఐ, జనసేన విద్యార్థి విభాగం నాయకులు పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ప్రభుత్వ సెలవు రోజున తరగతులు నిర్వహించడం సరికాదని సూచించగా, ప్రిన్సిపాల్ వెంటనే ప్రత్యేక తరగతులను నిలిపివేసి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
🏠 Home