పోలీసు సేవలకు గుర్తింపుగా హెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్కు అవార్డు
మదనపల్లె: విధి నిర్వహణలో అంకితభావం, సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా పీలేరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయనను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సునీల్ కుమార్ అవార్డు అందుకున్నారు.
పోలీసు శాఖలో విధి నిర్వహణ పట్ల చూపుతున్న నిబద్ధత, ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. అవార్డు అందుకున్న సునీల్ కుమార్ను పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.